కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 9 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7,8 తేదీల్లో జరిగిన అండర్-15 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 20 మంది వివిధ కేటగిరీల్లో సత్తా చాటారు. 55 కేజీల బాలికల విభాగంలో గీతాహర్షిని జాతీయ స్థాయి క్రీడాకారులతో తలపడి బంగారు పతకాన్ని దక్కించుకుంది.
ఆమె ఈ నెల 28 నుంచి మార్చి 5వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం పాటియాలలో జరిగే జాతీయస్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికైనట్లు డీవైఎస్వో సీతారాం తెలిపారు. కాగా.. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు శుక్రవారం ఇక్కడ అభినందించారు. కార్యక్రమంలో కాశీహుస్సేన్, నిహారిక, టి.వెంకటేశ్వర్లు, పీఈటీలు, పీడీలు రవి, శ్వేత, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.