ఖమ్మం: గీతా ఫౌండేషన్, మైసూర్ అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పారాయణం పోటీల్లో ఖమ్మం నగరంలోని న్యూవిజన్ పాఠశాల విద్యార్ధిని చంద్రహాసిని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణపతకాన్ని సాధించిందని ప్రిన్సిపాల్ అబాద్అలీ తెలిపారు. 700శ్లోకాలు అనర్గళంగా చెప్పడంతో గణపతి సచ్చిదానందస్వామి నుంచి పతకంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్ధిని న్యూవిజన్ విద్యాసంస్ధల చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్, డైరక్టర్, ఉపాధ్యాయులు అభినందించారు.