భద్రాచలం, జూలై 26 : గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పడుతున్న వర్షం తోడు కావడంతో నీటి ప్రవాహం పెరిగింది. బుధవారం మధ్యాహ్నం 43 అడుగులకు వరద చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు 46.20 అడుగులకు నీటిమట్టం చేరింది.
నీటి ఉధృతి పెరుగుతుండడంతో రాత్రి 10 గంటలకు 48.10 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగు నీటిని మోటార్లతో తోడుతున్నప్పటికీ రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం, కరివెన అన్నదాన సత్రం రహదారిపైకి నీరు చేరింది. చింతూరు, వీఆర్పురం, ఏటూరు నాగారం, చర్ల, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.