ఖమ్మం : మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, టిఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, నగర అద్యక్షులు పగడాల నాగరాజు, కార్పోరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, పసుమర్తి రాంమ్మోహన్రావు, టిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డెల్లి లెనిన్ చౌదరి,నాయకులు కనకం భద్రయ్య, మాటేటి కిరణ్, కొల్లు పద్మ, తన్నీరు శోభారాణి,తదితరులు పాల్గొన్నారు.