ఖమ్మం: ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల మాదిరిగానే ఉచిత న్యాయ సేవలను అర్హులైన ప్రతి ఒకరికీ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై.రేణుక అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు చేపట్టిన లీగల్ సర్వీసెస్ క్యాంపెయిన్ లో భాగంగా ఈనెల 30వ తేదీన ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించనున్న అవగాహనా సదస్సు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీస్ అధికారులకు అవగాహన కల్పించి లీగల్ సర్వీసెస్ క్యాంపెయిన్ ను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు ఆర్టికల్ 39 లో పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛహక్కుప్రతి ఒకరికి ఉందని నేరారోపణ చేసిన ఆర్థిక స్తోమత లేని వ్యక్తులు న్యాయసేవాఅధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందే వెసులుబాటు ఉందని అన్నారు.