ఖమ్మం: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు బోనకల్ మండలం రామాపురం, ఉదయం 11 గంటలకు ఖమ్మం పట్టణంలోని సప్తపది ఫంక్షన్ హాల్, మామిళ్లగూడెం, జీఎంఆర్ ఫంక్షన్ హాల్, మధ్యాహ్నం 12 గంటలకు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం, మధ్యాహ్నం 1 గంటకు సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్స్, సాయంత్రం 4 గంటలకు చింతకాని మండలం కోమట్లగూడెం, చింతకాని, కొదుమూరు, బస్వాపురం, గాంధీనగర్ తదితర గ్రామాల్లో పలు ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని దయాకర్రెడ్డి తెలిపారు.