పెనుబల్లి, మార్చి 24: మండలంలోని పలుగ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. మాజీసర్పంచ్ నాగరాజు ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. అనంతరం పాతఅగ్రహారంలో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న కార్యకర్తను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, నాయకులు లక్కినేని వినీల్, శీలం నాగిరెడ్డి, నాగదాసు, చింతనిప్పు సత్యనారాయణ, మందడపు అశోక్కుమార్, లగడపాటి శ్రీను, దొడ్డపునేని రవి, కృష్ణ, ఆవిటి మారేశ్వరరావు, ఆళ్ల అప్పారావు, నాగుళ్ల నరసింహారావు, నరకాల చంటి, మరీదు చంద్రశేఖర్, కోట ప్రభాకర్, వెంకీ, సత్యనారాయణ పాల్గొన్నారు.
వేంసూరు, మార్చి 24: మండలంలోని పలు కుటుంబాలను మాజీఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పరామర్శించారు. దిద్దుపూడి గ్రామానికి చెందిన జుంజునూరి అనసూర్య, మిరియాల మధువర్ధన్ రోడ్డు, జుంజునూరు రఘు ఇటీవల ప్రమాదానికి గురికాగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మోరంపుడి శ్రీధర్, మట్టా రవి, రామకృష్ణ, మిరియాల రవి, మల్లయ్య, ఉప్పల వెంకటేశ్, శివకృష్ణ, ప్రసాద్, జగదీశ్, గుర్రం శ్రీను, అబ్రహ్మం తదితరులు ఉన్నారు.