కారేపల్లి, మార్చి 23 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన మాజీ జడ్పీటీసీ వాంకుడొత్ జగన్ నాయక్ సతీమణి జమున ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సోమవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పాత కమలపురంలో గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ తేజవత్ బాబురావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆదే గ్రామానికి చెందిన కట్ల భద్రమ్మ ఇటీవల మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ
ఆయన వెంట ఎంపీటీసీల సంఘం మండల మాజీ అధ్యక్షుడు ధరవత్ పాండ్య నాయక్, మండల రైతుబంధు మాజీ కన్వీనర్ గుగులోత్ శ్రీను, ఇల్లెందు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడొత్ నరేశ్, టీడీపీ పాత కమలాపురం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కొత్త తిరుపతయ్య, కాటన్నీ రామారావు, తోటకూరి తిరుపతయ్య, తోటకూరి వెంకటేశ్వర్లు, కొడిమళ్ల వెంకన్న, కొర్ర నాగేశ్వరరావు, తేజవత్ కిషన్, సపావట్ కోటి, పాతకమలాపురం యూత్ అధ్యక్షుడు భూక్య నందు, భూక్య రవి, శ్రావణ్, రాజేష్, కోటి, దారావత్ వెంకట్, గిరిజన సంఘం నాయకులు భూక్య రాంకిషోర్ నాయక్, బానోతు రాజేష్ నాయక్, ఎన్టీఆర్ సేవా సమితి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త వెంకట్ చౌదరి పాల్గొన్నారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ