తుంగతుర్తి, మార్చి 10 : పశు పోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తుంగతుర్తి మండలం వెలుగుపల్లి సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 112 పశువులకు టీకాలు వేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ నరేశ్, ఉప సర్పంచ్ పసునూరి సాయికుమార్, రాజశేఖర్, రవి, గోపాలమిత్ర శ్రీను, పాడి రైతులు పాల్గొన్నారు.