ఎర్రుపాలెం : మండలంలోని పలుగ్రామాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ జరిగింది. ఈ కార్యకమాన్ని మంగళవారం ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవితలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ఎంపీపీ సూరానేని రామకోటేశ్వరరావు, ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ షేక్ మస్తాన్వలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, పట్టణ అధ్యక్షుడు చిన్నం రాము, బొర్రా నారాయణ, హుస్సేన్, మత్స్యశాఖ అధికారులు, చేపల చెరువుల కమిటీ సభ్యులు, సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.