ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 29: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ సమాప్తమయ్యా యి. ఇన్ని రోజులూ పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్ష రాసిన అనంతరం రెక్కలు వచ్చిన పక్షుల్లా కేరింతలతో సందడి చేశారు. చివరి పరీక్ష రాసి కేంద్రాల్లో నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆకాశాన్ని జయించినంత ఆనందంగా కన్పించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నా రు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లు, రూమ్ ల్లో ఉండి చదువుకున్న విద్యార్థులు ఈ పరీక్షలు ముగియగానే ఇంటి బాట పట్టారు. ఇం టర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, ప్రథమ సంవత్సర పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని డీఐఈవో రవిబాబు తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షల్లో 14,508 మంది విద్యార్థులకు గాను 494 మంది గైర్హాజరయ్యారని, 14,014 మంది హాజరయ్యారని వివరించారు.