ఎర్రుపాలెం: మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ గ్రామసర్పంచ్ కోట వజ్రమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్నకుమారుడు కోట కిరణ్కుమార్ ఇటీవల సివిల్స్లో విజయం సాధించి ఐపీఎస్కుసెలక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన కిరణ్కుమార్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కోట కిరణ్కుమార్ను, తల్లిదండ్రులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, జడ్పీటీసీ శీలం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, సర్పంచ్లు శీలం యలక్ష్మీ, ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు పాల్గొన్నారు.