ఇల్లెందు రూరల్, మార్చి 1 : హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్టు డిజైర్ కారులో రూ.21.60 లక్షల విలువ చేసే సుమారు 108 కిలోల గంజాయిని తరలిస్తుండగా బొజ్జాయిగూడెం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గంజాయిని అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. గంజాయి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని కారు, సెల్ఫోన్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.