ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం పత్తియార్డులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానుల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు తుంబూరి దయాకర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్చేసి వ్యాపారులు, రైతులు, కార్మికులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పొంగులేటి పుట్టిన రోజు వేడుకలు రైతుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అభిమానులకు, వ్యాపారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు, కమీషన్ వ్యాపారి కేవీ చారి, దిగుమతిశాఖ అధ్యక్షుడు దిరిశాల వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ఖరీదుదారులు, కమీషన్దారులు, కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.