HomeKhammamEstablishment Of A Special Board For Issuing Medical Certificates
ఉపాధ్యాయుల బదిలీ జాతర
విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది.. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని అనుసరిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసింది..
ఖాళీలు, ఉద్యోగోన్నతుల అర్హుల జాబితా విడుదల
వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ప్రక్రియ నిర్వహణ
పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు
మెడికల్ సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు
విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది.. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని అనుసరిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేసింది.. ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లాలకు పరిశీలకులను నియమించింది. బదిలీల షెడ్యూల్ శనివారం ప్రారంభమవుతుంది.. ఇదే రోజు నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఫిబ్రవరి 3 నుంచి 6 తేదీల మధ్య దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.. 11, 12 తేదీల్లో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల్ల సీనియార్టీ జాబితా వెలువడుతుంది.. 19, 20 తేదీల్లో టీచర్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.. ఉపాధ్యాయుల్లో గానీ, వారి భాగస్వామి, పిల్లల్లోగానీ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ టీచర్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు.. నిర్ణీత సర్వీసు పూర్తి చేసుకున్న అన్ని రకాల ఉపాధ్యాయులకు బదిలీల్లో అర్హత కల్పించారు.. ఎస్జీటీ నుంచి ఎస్ఏగా ఉద్యోగోన్నతి పొందే అర్హుల ప్రొవిజనల్ జాబితాను విద్యాశాఖాధికారులు విడుదల చేశారు.. అలాగే, ప్రమోషన్లు పొందేవారి కోసం ఆయా కేటగిరీల్లోని ఖాళీలను కూడా ప్రకటించారు. ఈ క్రమంలో టీచర్లకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ్రప్రభుత్వాసుపత్రిలో బోర్డును ఏర్పాటు చేశారు..
– ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27
ప్రస్తుత కౌన్సిలింగ్కు సంబంధించి అనారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. ఉద్యోగులకు సంబంధించిన భార్య, భర్త, పిల్లలు తీవ్రమైన అనారోగ్యం ఉంటే దానిని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో ప్రాధాన్యమిచ్చారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. క్యాన్సర్, ఓపెన్హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్ టీబీ, కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, మానసిక వైకల్యం తదితర వ్యాధులతో బాధపడేవారికి కౌన్సిలింగ్లో ముందుగా బదిలీకి అవకాశమిస్తారు.
బదిలీలకు అర్హులు వీరే..
ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు ఇలా అన్నిరకాల వారికి బదిలీలు వర్తించనున్నాయి. 2022 ఫిబ్రవరి1 నాటికి 2 సంవత్సరాలు పూర్తి అయిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 ఫిబ్రవరి 1వ నాటికి ఒకే స్టేషన్లో 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ చేయబడతారు. పదవీ విరమణకు 3 సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. తప్పనిసరి బదిలీలో ఉండి బదిలీకి దరఖాస్తు చేయని, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోని ఉపాధ్యాయులను మిగిలిపోయిన ఖాళీల్లో బదిలీ చేస్తారు.
కేటగిరీల వారీగా
కేటగిరీ-1లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరానికి 1 పాయింట్, ప్రతి నెలకు 0.083 పాయింట్లు, కేటగిరి-2లో ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరానికి 2 పాయింట్స్, ప్రతి నెలకు 0.16 పాయింట్లు, కేటగిరీ-3లోని ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరానికి 3 పాయింట్లు, ప్రతి నెలకు 0.25 పాయింట్లు కేటాయిస్తున్నారు.
ప్రొవిజనల్ జాబితా విడుదల..
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)గా ఉద్యోగోన్నతి పొందేందుకు అర్హులైన ప్రొవిజనల్ జాబితాను విద్యాశాఖాధికారులు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలను ఎస్ఏలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు అందిరిని ఎంపిక చేశారు. లోకల్బాడీ పరిధిలో ఎస్ఏ గణితం, ఫిజకల్ సైన్స్లో జనరల్లో 2000 సంవత్సరం, ఎస్సీ 2008, ఎస్టీ 2005 సంవత్సరం ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారు. బయాలజికల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్కి జనరల్ అండ్ ఎస్సీ 1998 అక్టోబర్ 26, ఎస్టీకి బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ 2005, ఎస్టీకి ఇంగ్లిష్కి 2002 అక్టోబర్ 17 ఉన్న ఎంపిక చేస్తున్నారు. ఎల్ఎఫ్ఎల్కి జనరల్ అండ్ ఎస్టీ 1998 సెప్టెంబర్, ఎస్టీ 2002 ట్రైనింగ్ వారికి ఎంపిక చేస్తున్నారు.
ఉద్యోగోన్నతులకు ఖాళీలు…
జిల్లాలో ఉద్యోగోన్నతులు పొందేందుకు వివిధ కేటగిరిలో ఖాళీలను విద్యాశాఖాధికారులు ప్రకటించారు. ప్రభుత్వ, లోకల్బాడీలో కలిసి గ్రేడ్-2 హెచ్ఎం పరిధిలో 79, స్కూల్ అసిస్టెంట్స్లో గణితం-44, ఫిజికల్ సైన్స్-9, బయాలజికల్ సైన్స్-89, సోషల్-142, తెలుగు-36, హిందీ-20, ఇంగ్లిష్-27, పీడీ-5, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం-77 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా భర్తీ చేయనున్నారు.
మెడికల్ సర్టిఫికెట్ల జారీకి బోర్డు ఏర్పాటు..
టీచర్లకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్స్ జారీ చేసేందుకు ప్రభుత్వాసుపత్రిలో బోర్డును ఏర్పాటు చేశారు. 10మంది డాక్టర్ల బృందంతో అన్ని స్పెషలైజేషన్లతో కూడిన బోర్డును మెడికల్ బోర్డు చైర్మన్, సూపరిండెంట్ ప్రకటించారు. ప్రతిరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాల మీటింగ్ హాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. డాక్టర్లు కృపా ఉషాశ్రీ(గైనిక్), రామ్మూర్తి(ఈఎన్టీ), శ్రీనివాసరావు(ఆర్ధో), నాగేశ్వరరావు(జనరల్ మెడిసిన్), అమర్సింగ్(డెర్మాటాలజీ), వెంకటేశ్వర్లు(జనరల్ సర్జరీ), అశోక్కుమార్(డెంటల్), సీతారాం(కార్డియాలజీస్ట్), చైతన్య(న్యూరో సర్జరీ), వేణుగోపాల్(నెఫ్రాలజీస్ట్)లు ఉన్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27: ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల జాతర మొదలైంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లా విద్యాశాఖ బదిలీల కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నది. అవకతవకలకు తావులేకుండా బదిలీల ప్రక్రియను పారదర్శకంగా వెబ్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. కౌన్సిలింగ్ నిబంధనల్లో రెండు, మూడు అంశాలు మినహా పాత విధానాలనే కొనసాగిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యం ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించి పరిగణలోకి తీసుకోనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం, విద్యాశాఖ పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఆన్లైన్ విధానంలో ప్రక్రియ పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయనున్నది. ఇందుకు సంబంధించి పర్యవేక్షణకు జిల్లాలకు అబ్జర్వర్లను నియమించింది.
షెడ్యూల్ ఇలా…
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను వెలువరించారు. ఆన్లైన్ విధానంలో జరుగుతుండగా ఈ నెల 28నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసిన ఆన్లైన్ కాపీలను ప్రింట్ అవుట్ తీసి వాటికి సర్టిఫికెట్స్ జతపరిచి సంబంధిత ఎంఈవో, డీఈవోకు అందజేయాలి. 3నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులు పరిశీలన చేయనున్నారు. 7, 8వ తేదీన అభ్యంతరాలను పరిశీలించనున్నారు. 11, 12వ తేదీన మార్గదర్శకాల ఆధారంగా ఉన్న బదిలీలు, ప్రమోషన్లు సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు. 19నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు.
బదిలీలకు అన్నీ సిద్ధం..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. వివరాలన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. పరిశీలనతో సైతం అన్ని అంశాలపై దృష్టి సారిస్తాం. ఉద్యోగోన్నతులకు అర్హులైన వారి జాబితా, ఖాళీల జాబితాను ప్రకటించాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తాం.