ఆధునిక కాలంలో ఏ రంగంలో రాణిం చాలన్నా ఆంగ్లంపై పట్టు ఉండడం అత్యంత అనివార్యం. పాఠశాల విద్యలోనే ఇందుకు బలమైన పునాది పడాలి. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని విస్తృత అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపు చ్చుకోవాలని సంకల్పించారు. ఇందుకు పాఠశాల విద్యే సరైన ఫౌండేషన్ అని గమనిం చారు. దీనిలో భాగంగానే ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల్లోని పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందించేందుకు పెద్దపీట వేశారు. దీంతో వారి బంగారు భవితకు ఎంతో మేలు కలుగనుంది. దీంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
-ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 26
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 26 :పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలన్నా ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాల్సిందే. ప్రతిభ కనబరచాలన్నా.. ఆంగ్లపై పట్టు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాషలో అరితేరాల్సిందే. ఆంగ్లం రాకపోతే అవకాశాలు ఆమడ దూరంలోనే ఆగిపోతాయి. కార్పొరేట్ పాఠశాలల్లో సంపన్నుల పిల్లలకే పరిమితమైన ఆంగ్ల విద్యావకాశాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదింటి బిడ్డల దరిచేరనున్నది. ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటర్లో ఒక్కసారిగా ఆంగ్లంలోకి మారి తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థుల భవిష్యత్ గురించి సర్కార్ ఆలోచించింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ఆంగ్లం అనివార్యమంటున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి డిగ్రీ వరకు చదివి, పట్టా తీసుకొని ఇంటర్వ్యూలకు వెళ్తే ఇంగ్లిష్ రాదని, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనే సాకుతో చాలా మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు దీటుగా ప్రైవేట్రంగంలోనూ అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు వరంగా మారింది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానుంది. ఈ నేపథ్యంలో విద్యానిపుణులు, విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలుగు మీడియం కొనసాగిస్తూ సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం నిర్వహించాలి. విద్యార్థుల తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నారు. నాణ్యమైన విద్య ఇంగ్లిష్లోనే లభిస్తుందని భావిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇంగ్లిష్పై శిక్షణ కల్పించాలి. ఖాళీల భర్తీలో టీఆర్టీ నియామకాల్లో ఇంగ్లిష్ మీడియం బోధించడానికి సామర్థ్యం కలిగిన వారిని తీసుకోవాలి.
-చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యం అమలు చేయడాన్ని అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరడంతోపాటు బోధన సిబ్బంది నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లిష్ మీడియం నిర్వహణకు అనుగుణంగా చర్యలు చేపట్టడం వల్ల ప్రాథమిక స్థాయి నుంచి విద్యను పటిష్టం చేయవచ్చు. – పీ నాగిరెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్ ఉండాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఆంగ్ల మాధ్యమ చదువులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపనున్నది. ప్రతి స్కూల్లో ఇంగ్లిష్లో నైపుణ్యాలు, సామర్థ్యాలు కలిగిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్లను నియమించాలి.
-దేవరకొండ సైదులు, ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిహర్షణీయం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని, ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధిచేకూరనున్నది.