రఘునాథపాలెం, జనవరి 17 : మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలు కానున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. మంగళవారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి ఖమ్మంలో జరిగే బహిరంగ సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం ప్రధాన ఎజెండాకే ప్రజలు జై కొడుతున్నారని, అది ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమౌతుందన్నారు. దేశ రైతాంగం ఎజెండాయే బీఆర్ఎస్ పార్టీ ముందున్న కర్తవ్యమన్నారు. ఖమ్మం సభకు హాజరయ్యే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.