ఎర్రుపాలెం: మండల తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో శుక్రవారం రెవెన్యూ అధికారులకు వాగ్వీవాదం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ కే.ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన జరుగుతున్నసమావేశంలో ఆర్ఐ భాషా మీనవోలు వీఆర్వో వైశ్యనాయక్ను విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ప్రశ్నించగా సదరు వీఆర్వో ఆర్ఐతో గొడవపెట్టుకోవడంతో వెంటనే పక్కన ఉన్న వీఆర్వోలు అడ్డుకొని సర్ధి చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ, వీఆర్వోలు గొడవపడిన విషయాన్ని డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు.