కల్లూరు, అక్టోబర్ 14 : తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు భరోసా కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గిరిజన సభ్యులను సర్పంచ్లుగా మరోపక్క దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమలుచేసి ఒక్కో యూనిట్కు రూ.10లక్షలు అందించి దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన ఏకైక వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం కల్లూరు మండల పరిధిలోని ఎర్రబంజర, బత్తులపల్లి, కప్పలబంధం, లక్ష్మీపురం, అడవి బోడిమెల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్యే సండ్రకు బతుకమ్మలు, డప్పు వాయిద్యాలతో, బాణసంచాతో మహిళలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బత్తులపల్లి, కప్పలబంధం, ఎర్రబంజర సర్పంచ్లు సత్యనారాయణరెడ్డి, గుగులోతు లచ్చిరాం, నందిగామ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని, కేసీఆర్ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంట్లో ఉందని ఆయనన్నారు.
అడవిబోడిమల్లె, రాళ్లబంజర, లక్ష్మీపురం గ్రామాల్లో రైతులకు భూపట్టాలు ఇప్పించే విషయంలో తనవంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయని, 9 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వేలాది కోట్ల నిధులతో రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధిబాట పట్టించారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ రైతుబంధు, రైతుబీమా అమలుచేస్తూ వ్యవసాయానికి భరోసా కల్పించారన్నారు. కల్యాణలక్ష్మి, షాధీముబారక్, ఆసరా పథకాలతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, నవంబర్ 1న షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని, ఈ సభకు లక్షలాదిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కేసీఆర్కు మద్ధతు పలకాలని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ఎన్నుకునేందుకు ప్రతిఒక్కరూ నుడం భిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.