ఖమ్మం: రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుక్రవారం హైద్రాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి బాలరాజు యాదవ్కు శాలువాతో సత్కరించారు. బాలరాజుకు మంచి భవిష్యత్ ఉంటుందని ,మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు. మంత్రితో పాటు మాజీ ఎంఎల్సీ బాలసాని లక్ష్మినారాయణను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు