ఖమ్మం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన శ్రీహరి రోహిత్ శ్రీస్వామి వారి శాశ్వత అన్నదానానికి రూ.100,116 విరాళంగా అందించారు. ఐఏఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో జగన్మోహన్రావు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల కృష్ణమోహనశర్మ, సూపరిండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయకుమారి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.