కల్లూరు:మండల కేంద్రమైన కల్లూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మహిళకు శస్త్రచికిత్స చేసి ఎనిమిది కేజీల కణితిని తొలగించిచారు వైద్యులు. ఈ సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెందిన దుగ్గిరాల భద్రమ్మ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. తీవ్రమైన నొప్పితో కల్లూరులోని మాధవి ఆసుపత్రికి రాగా వైద్యులు మాధవి ఆమెను పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించాలని ఆమెకు సూచించగా బాధితురాలు అంగీకరించడంతో గైనకాలజిస్ట్ మాధవితో పాటు హైదరాబాద్కు చెందిన కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ రాము, ఎనస్తీషియా కిరణ్కుమార్లు ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 8కేజీల కణితిని తొలగించారు.