సత్తుపల్లి : సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో వ్యాపారులు, చిరువ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని మునిసిపల్ కమిషనర్ సుజాత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లను వాడకూడదని, ఈ కవర్ల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో పాలిథిన్ కవర్లను నిషేధించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే అమ్మిన, వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.