కొత్తగూడెం టౌన్, మార్చి 22: చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ శిరీష సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన డిస్ట్రిక్ట్ చైల్డ్ డెత్ కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధుల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.
అనంతరం, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, కారణాల గురించి చర్చించారు. మరణాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పిల్లలకు అందించే పౌష్టికాహారం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ కోరశ్రీ యాదవ్, డాక్టర్ పుష్పలత, డాక్టర్ వీరబాబు, డాక్టర్ వెంకన్న, డాక్టర్ బాలాజీ, సీహెచ్వో నాగభూషణం, పీహెచ్సీ వైద్యాధికారులు పాల్గొన్నారు.