ఖమ్మం : దీపావళి పండుగను పురస్కరించుకొని నగర ప్రజలకు మేయర్ దంపతులు పునుకొల్లు నీరజ, రామబ్రహ్మంలు శుభాకాంక్షలు తెలిపారు. సుగ్గులవారి తోటలోని వారి నివాసంలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. దీపం వెలుగులతో చీకటి పారద్రోలి దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ వేడుకల్లో వారితో పాటు వారి కుమారులు పృద్వి, మౌని కోడళ్లు దేవిక తదితరులు పాల్గొన్నారు.