మామిళ్లగూడెం, ఫిబ్రవరి 26 : టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అందులో 5 ప్రభుత్వ, 22 ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేయగా పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది.
ముగ్గురు ఫ్లయింగ్ స్కాడ్, ఆరుగురు లైజనింగ్, 27మంది అసిస్టెంట్ లైజనింగ్, 27మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. హాల్టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. భార్యలు పరీక్షా కేంద్రంలోకి వెళ్లగా బయట భర్తలు చంటిపాపలను ఆడించడం కనిపించింది.