భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాబూరావు, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్గా తిరుపతయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రియాంక ఆలను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క, పుష్పగుచ్ఛాన్ని అందించారు.