ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22:పవిత్ర రంజాన్ పర్వదినం భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ముస్లిం సోదరులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కేకే ఇన్ఫ్రా డెవలఫర్స్, మన్నేసాహెబ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 2వేల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ట్రస్టు బాధ్యులతో కలిసి పంపిణీ చేశారు. అదే విధంగా రఘునాథపాలెం మండలం కామంచికల్ శివారు పట్వారిగూడెం మజీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, డీసీసీబీ డైరక్టర్ ఇంటూరి శేఖర్, కూసుమంచి మండల ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, మల్లీడు వెంకన్న, వెంపటి రవి నిర్వాహకులు ఖలీల్, ఖాదర్, వసీం, రహ్మతుల్లా, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 22 : జింకలగూడెంలో ముస్లింలకు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మండలంలోని ముజాహితిపురం, కాకరవాయి, రాజారంలో మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేశ్రెడ్డి, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, టీఆర్ఎస్ నాయకులు షేక్ సైపుద్దీన్, ఉపేందర్, కొత్తపల్లి నాగయ్య, కట్కూరి శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ముదిగొండ ఏప్రిల్ 22: ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం లో ముస్లిం సోదరులకు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, సర్పంచ్ మందరపు లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు తోట ధర్మారావు, షేక్ ఖాజా, యర్ర వెంకన్న, పసుపులేటి వెంకట్, బత్తుల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.