కామేపల్లి, ఏప్రిల్ 26: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల వద్దకు వచ్చి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు వారి మాయమాటలను నమ్మవద్దని కోరారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను కామేపల్లి రైతువేదికలో బుధవారం ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ నిండు మనసుతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు బానోత్ సునీత, ధనియాకుల హనుమంతరావు, ఆంతోటి అచ్చయ్య, మల్లెంపాటి శ్రీనివాసరావు, రాందాస్నాయక్, అనంతరాములు, గబ్రూనాయక్, కోట రవికుమార్, సిలార్సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి, ఏప్రిల్ 26: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కోరారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లిలో బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అన్నపూర్ణ, లంకపల్లి వీరభద్రం, శంకర్నాయక్, హల్యానాయక్, కేళి, డోర్నల విజయమోహన్రావు, లక్కినేని శ్యామ్బాబు, ఉదయ్కుమార్, బాలాజీ, బొమ్మెర్ల వరప్రసాద్, కంభంపాటి చంద్రశేఖర్రావు, పూల్సింగ్నాయక్, గణేశ్, వెంకటేశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.