అశ్వాపురం/ భద్రాచలం, జూలై 7: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. రూ.4 కోట్ల నిధులతో అశ్వాపురం ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మిస్తున్న సైడ్ డ్రెయిన్లు, సెంట్రల్ లైటింగ్ పనులను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాల గురించి కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగా మాట్లాడుతూ.. అశ్వాపురం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అవసరమైతే మరికొన్ని నిధులు కేటాయించి అభివృద్ధిలో తీర్చిదిద్దుతామని అన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా మండలాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే సమగ్ర అభివృద్ధిని సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకుడు చిలకా వెంకటరామయ్య పాల్గొన్నారు.
రేగా వాహనానికి రిజిస్ట్రేషన్
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తన నూతన ఎంజీ గ్లోస్టర్ వాహనానికి భద్రాచలం ఎంవీఐ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకోసం కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఎంవీఐ తిరుపతి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రేగా కాంతారావు తన వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, నక్కా ప్రసాద్, పూజారి కృష్ణ, యాంపాటి సందీప్రెడ్డి, ఎంబీ ఆదాం, సుగ్యాల శ్రీకాంత్, గుమ్మడివెల్లి సాయి, కోరి వినోద్కుమార్ పాల్గొన్నారు.