అశ్వారావుపేట, అక్టోబర్ 29: వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టి ప్రజలు అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమస్యలతో సహవాసం చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారన్నారు. రాష్ట్రం వస్తే చిమ్మ చీకట్లేనని నాటి ఆంధ్రా పాలకులు అవహేళన చేశారని గుర్తుచేశారు. కానీ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏమీ చేయలేదని మండిపడ్డారు. నాడు కరువు కాటకాలు ఉండేవని, ప్రజలు బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రావు జోగేశ్వరరావు, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, బీఆర్ఎస్ నాయకులు డీకేఎం మహీపాల్, కోటగిరి సీతారామస్వామి, యూఎస్ ప్రకాశ్రావు, బిర్రం వెంకటేశ్వరరావు, నల్లపు లీలాప్రసాద్, జుజ్జూరు వెంకన్నబాబు, మందపాటి రాజమోహన్రెడ్డి, కాసాని చంద్రమోహన్, తాడేపల్లి రవి, మారుతి లలిత, పొడియం సత్యవతి, నారం రాజశేఖర్, నార్లపాటి రాములు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సహాకారంతో ‘పేట’ అభివృద్ధి: ఎమ్మెల్యే మెచ్చా
సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేపినట్లు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. గృహలక్ష్మి ద్వారా గూడు లేని పేదలకు ఆర్థిక భరోసా దొరికిందన్నారు. పార్టీ క్యాడర్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. నియోజకవర్గంలో 10 వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు.
మండలంలోని తిరుమలకుంట, తిరుమలకుంట కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి, అనీల్, మడకం నాగులు ఆదివారం ఎంపీ నామా, ఎమ్మెల్యే మెచ్చా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి ఎంపీ పార్టీలోకి ఆహ్వానించారు.