ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అనుగుణంగా కేటాయించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా కూసుమంచిలో నలుగురు సీఆర్పీలకు ఒకే టీచర్ ఉన్న పాఠశాలలో విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఇతర మండలాల ఎంఈఓల విజ్ఞప్తుల ఆధారంగా డిప్యూటేషన్ కేటాయించనున్నారు.