ఎర్రుపాలెం: మండల పరిధిలోని మామునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఖమ్మం డీఈవో యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ను విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై వాకబు చేశారు. పదోతరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
మధ్యాహ్న భోజనం అమలు తీరును గురించి ఆరా తీశారు. ఖాళీగా ఉన్న సబ్జెక్టులో ఉపాధ్యాయులను నియమించేలా ఉన్నత అధికారులకు సమాచారం పంపుతామన్నారు.విద్యార్థులు మాస్క్లు,శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో ప్రభాకర్, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.