ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న 2వ, 4వ సెమీస్టర్ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 36 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరిగాయని, ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ వై.వెంకయ్య తెలిపారు.