ఖమ్మం : ఖమ్మంజిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు ఉన్న భక్తిభావన ఈ ఆలయనిర్మాణాన్ని పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే యాదాద్రి నిర్మాణం ఎంతో ప్రత్యేకత కలిగి ఉందన్నారు.
శిల్పకళ సంపద, గోపుర నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తనయుడు, కార్పొరేటర్ వలరాజు తదితరులు పాల్గొన్నారు.