ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం, శఖునవీడు గ్రామపంచాయతీల్లో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శీలం కవిత, మామునూరు టీఆర్ఎస్ అధ్యక్షుడు చిన్నవెంకటేశ్వర్లు, మన్యం నరసింమారావు, కోటా రవి, దంతాల నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.