చింతకాని, డిసెంబర్ 1: దళితబంధు పథకాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. గురువారం చింతకానిలో లబ్ధిదారులకు మెడికల్ షాప్, వాహనం, కిరాణం, డోజర్ తదితర యూనిట్లలను అందజేసి మాట్లాడారు. పల్లెల్లో రాజకీయాలకు అతీతంగా దళితబంధు అమలు చేస్తున్నామని, మండలంలో దళిత కుటుంబాలకు నూరుశాతం దళితబంధు అమలు జరుగుతుందని పేర్కొన్నారు.
చింతకాని గ్రామంలో ఇద్దరు లబ్ధిదారులకు రూ.75వేలు విలువైన చెక్కులను జడ్పీచైర్మన్ గురువారం అందజేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మధిర నియోజకవర్గంలో 1,600 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు. కిలారు మనోహర్బాబు, బండి సుభద్ర, పెంట్యాల పుల్లయ్య, కోపూరి పూర్ణయ్య, గురజాల హనుమంతరావు, మేకనబోయిన రాంబాబు, దాసరి వెంకటేశ్వర్లు, అంగిడి సుధాకర్, పఠాన్ షబ్బీర్ఖాన్, కిలారు బాబూరావు, బండి తిరపయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.
దళితుల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. గురువారం మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో దళితబంధు ద్వారా లబ్ధిదారుడికి మంజూరైన ట్రాక్టర్ను ప్రారంభించారు. సర్పంచ్ తుడుం రాజేశ్, ఎంపీటీసీ పెంట్యాల భారతమ్మ, ఉపసర్పంచ్ తుళ్ళూరి అచ్చయ్య, కమల ప్రణీత, తుడుం కృష్ణ, రవికుమార్, పాపినేని రంగారావు పాల్గొన్నారు.