ఖమ్మం : పాల ఉత్పత్తిదారులకు రాయితీలు అందించి వారిని పోత్సహించే విజయ డెయిరీని కాపాడుకుంటామని పాడి రైతులు అన్నారు. గత కొద్దిరోజులుగా విజయ డెయిరీ డీడీని టార్గెట్ చేస్తూ చైర్మన్లు చేస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పాల ఉత్పత్తిదారులు, సొసైటీ చైర్మన్లు ఖమ్మంలోని విజయ డెయిరీకి చేరుకుని డీడీకి మద్దతుగా నిలిచారు. డీడీ భరతలక్ష్మిపై చేసిన అవినీతి ఆరోపణలు అసత్యం అంటూ మండిపడ్డారు.
గత చైర్మన్లు చేసిన అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసినందుకే డీడీని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. చైర్మన్లుగా వారి చేసిన అక్రమాలకు మేము సైతం బాధితులుగా ఉన్నామని పాడి రైతులు వాపోయారు.