ఖమ్మం : ఖమ్మం జిల్లా క్లస్టర్స్ రీసోర్స్ పర్సన్(సీఆర్పీ) అసోసియోషన్ జిల్లా కార్యవర్గం సమావేశం బుధవారం రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరందాసు సంతోష్ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఖమ్మం జిల్లా నూతన అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా మొగులూరి వీరయ్య, కనకపూడి బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గౌరవాధ్యక్షుడిగా చిలక ప్రభాకర్, ట్రెజరర్గా తాళ్లపల్లి వెంకటరత్నం,ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు, రమేష్, నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా రవిబాబు, బాలకృష్ణ, లకావత్ రాములు, షేక్ యాకూబ్లను నియమించారు. మహిళా అధ్యక్షురాలిగా మారుతీ నిర్మలాదేవి, ఉపాధ్యక్షురాలిగా అనురాధలుఎన్నికయ్యారు.