ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపామన్నారు. రెండు రోజులుగా ఆయా నియోజకవర్గానికి చెందిన ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
417 మంది రైతులకు చెందిన 600 ఎకరాల మిర్చీ పంటలు దెబ్బత్నిట్లు గుర్తించామని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 115 మంది రైతులకు చెందిన 170 ఎకరాలు, వైరా నియోజకవర్గంలో 160 ఎకరాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో40 ఎకరాలలో మిర్చితోటలు , పాలేరు నియోజకవర్గంలో 230 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అన్నారు.