Revanth Reddy Khammam Tour | ఖమ్మం రూరల్: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి వేళ సీపీఎం నాయకుల ఇంటికి వెళ్లిన పోలీసులు.. పడుకున్న వారిని నిద్రలేని తీసుకెళ్లారు. నండ్ర ప్రసాద్, వడ్లమూడి నాగేశ్వరరావు, కారుమూరి గురువయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ అక్రమ అరెస్టులను సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. తాము ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు పిలుపు ఇవ్వకపోయినా అర్ధరాత్రి వేళ పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.