ఖమ్మం : చట్టవ్యతిరేక చర్యలకుఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని డీసీపీ ఎల్సీ నాయక్ అన్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో గురువారం తెల్లవారుజామున సత్తుపల్లి పోలీసుల ఆద్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు గుర్తింపు కార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీపీ నాయక్ మాట్లాడుతూ..నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు.. స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా మేమున్నామని భరోసా కల్పించడం కోసమే ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆసాంఘిక కార్యాకాలపాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు వివరించారు.
అదేవిధంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, అయా ప్రాంతాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయములో అయిన డయల్ 100 కు లేదా స్దానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిచాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్డన్ సెర్చ్ లో సరియైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను, కారు, ఒక ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ రమాకాంత్, కరునాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.