ఎన్నికల వేళ కాంగ్రెసోళ్ల మాటలు రైతన్నలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు గంటల కరెంటుతో పంటలు పండించుకోవచ్చని, 10హెచ్పీ మోటర్తో నీరు పారించుకోవచ్చని చెబుతున్న కాంగ్రెస్ నేతల వెర్రిమాటలపై అన్నదాతలు చిర్రెత్తుతున్నారు. అధికారంలోకి వస్తే మంచి చేసేదిపోయి.. 24 గంటల ఉచిత కరెంట్కు బదులు 3 గంటలు ఇస్తామని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోండి అని చెబుతూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. కర్షకులపై కాంగ్రెస్ నేతలు కక్షగట్టి రోజుకో విధంగా మాట్లాడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో రైతులు హస్తం పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఏ టెన్షన్ లేకుండా వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా సాగుతున్న తమ బతుకులను ఆగం చేస్తారా.. అని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగం పూర్తిగా నిర్వీర్యమవుతుందని, దళారులు రాజ్యమేలుతరని గొంతెత్తి ఘోషిస్తున్నారు. ఆగమాగంగా ఉన్న తమ బతుకులను ప్రశాంతంగా ఉండేలా చేసిన సీఎం కేసీఆర్కే తమ మద్దతు అని ప్రకటిస్తున్నారు.
ఖమ్మం, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏటా సాగు పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న రైతులపై కాంగ్రెస్ నేతలు కక్షగట్టారు. అసెంబ్లీ ఎన్నికల సభలు, సమావేశాల్లో ఒక్కో నేత రోజుకో విధంగా మాట్లాడుతూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు గంటల కరెంటుతో పంటలు పండించుకోవచ్చని, 10హెచ్పీ మోటర్తో నీరు పారించుకోవచ్చని చెబుతున్నారు. ధరణి పోర్టల్ను తొలగించి భూమాత పోర్టల్ పెడతామని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు లోతైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆదమరిస్తే తిరిగి అర్ధరాత్రి కరెంటు తిప్పలు తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వరాష్ట్ర సాధనకు ముందు రైతులు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాత్రనక పగలనక పొలంలో జాగారం చేస్తే తప్ప పంట చేతికొచ్చేది కాదు. వచ్చీరాని కరెంట్తో మాటిమాటికీ మోటర్లు కాలిపోవడంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడేది. ఈ క్రమంలో ఎంతో మంది రైతులు సాగుకు స్వస్తి పలికి పట్టణాలు, నగరాలకు వలసబాట పట్టిన పరిస్థితులు ఉండేవి. ఎవుసానికి మూలాధారమైన విద్యుత్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారు. సాగు రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో 24 గంటల ఉచిత విద్యుత్ను అందుబాటులోకి తెచ్చారు. రైతుల పక్షాన నిలిచి వివిధ పథకాలను అందిస్తున్న క్రమంలో రైతులందరూ ఏ సమస్యా లేకుండా పంటలు పండించుకుంటుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సాగు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పడంతో మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను తీసివేస్తే తిరిగి తెలంగాణలో దళారుల రాజ్యం తప్పకపోవచ్చు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ను తీసివేస్తామని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలనలో భూమిని సాగు చేసుకునేది ఒకరైతే.. భూ యజమానులు మరొకరు. వారసత్వంగా వచ్చిన భూమిని పంచుకునేందుకు నాడు అన్నదమ్ములు పడ్డ్డ అవస్థలు అనేకం.గ్రామాల్లో భూ పంచాయితీ వచ్చిందంటే చాలు దళారులు, పట్వారీలకు పండగే. దీంతో ఎక్కడ చూసినా నిత్యం భూ పంచాయితీలే. చివరకు ఆడపిల్లకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన భూమిని సైతం ఆపద కాలంలో అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘ ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ భూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అనేక మంది నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భూ వివరాలను పూర్తిగా ఆన్లైన్ చేసుకునేందుకు, సాదా బైనామాలకు అవకాశం కల్పించడంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగినైట్లెంది. పైసా ఖర్చు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు రావడంతో దశాబ్దాల కల, అనేక చిక్కుముడులకు చెక్ పడినైట్లెంది. దీంతో ప్రస్తుతం సాగు రైతులకు ధరణి కొండంత ధైర్యం ఇచ్చినైట్లెంది.
ప్రస్తుత సర్కారు అవలంభిస్తున్న ధరణి పోర్టల్ ద్వారా రైతాంగానికి సానుకూలంగా ఉంది. ధరణి రద్దయితే మళ్లీ దళారుల ఆగడాలు మొదలవుతాయి. గత ప్రభుత్వాల హయాంలో వీఆర్వోలు, మధ్యదళారుల ఆగడాలతో భూ రికార్డులు మారి భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సాగు చేసుకుంటున్న రైతు పేరు కాకుండా పైరవీదారుల పేర్లు ఉండేవి. ధరణిపోర్టల్ కొనసాగితే ఇలాంటి అక్రమాలకు తావుండదు.
కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినట్లు మూడు గంటలు విద్యుత్ ఇస్తే వ్యవసాయం చేసే పని ఉండదు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు రైతాంగానికి తెలియని కావు. ఇంటికి వెళ్లకుండా బోర్లు, బావుల వద్దనే కరెంట్ కోసం పడిగాపులు కాసిన రోజులు మర్చిపోలేము. కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. లోవోల్టేజీతో మోటర్లు తరచూ కాలిపోయిన పరిస్థితి ఉండేది.
మూడు గంటలు కరెంట్తో రైతన్నకు ముప్పు వాటిల్లుతుంది. 24 గంటల విద్యుత్తోనే పంటకు పుష్కలంగా నీరు అందుతుంది. 10 హెచ్పీ మోటర్లు, 3 గంటల విద్యుత్తో రైతు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. రైతులు 24 గంటలు కరెంట్ను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటు వేయాలి.
తెలంగాణ సర్కారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగం సజావుగా సాగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి, నిరంతర విద్యుత్తో వ్యవసాయం సజావుగా సాగుతుంది. మళ్లీ ఇప్పుడు ఈ విధానాలు మారితే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు వ్యవసాయ భూముల్లో 10 హెచ్పీ మోటర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కొనుగోలు భారం పెరగడంతో పాటు ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్పార్మర్లు కాలిపోతాయి. ప్రస్తుతం 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం అనుకూలంగా ఉంది. ఇదే విధానం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి .. కేసీఆర్ సీఎం కావాలి..
రైతులు బాగుపడటం కాంగ్రెస్కు ఇష్టం లేదు. మూడు గంటలు కరెంట్తో పొలాలు సాగు కావు. ప్రస్తుతం 24 గంటలు కరెంట్తో 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు బాగా పోస్తున్నాయి. కాంగ్రెసోళ్లు మూడు గంటలు కరెంట్ ఇచ్చి 10 హెచ్పీ మోటర్లను స్టార్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. రైతులతో పాటు, ఇళ్లలో కూడా కరెంట్ కష్టాలు మొదలవుతాయి. కాంగ్రెస్ వస్తే బతుకులు ఆగం కావడం ఖాయం. ఈ పదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విధానాలతో రైతులంతా ఆర్థికంగా బలోపేతం అయ్యాం. కాంగ్రెసోళ్లను నమ్ముకుంటే వ్యవసాయం బుగ్గిపాలే. మంచి చేసేటోళ్లను వదిలి దొంగలకు కట్టబెట్టొద్దు.
అధికారంలోకి వచ్చేందుకు వ్యవసాయంపై అవగాహన లేకుండా కాంగ్రెసోళ్లు హామీలు ఇవ్వడం సరికాదు. గత ప్రభుత్వాల హయాంలో లోఓల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. పండించిన పంట రిపేర్లకే సరిపోయేది. కరెంట్ కూడా సరిపడా వచ్చేది కాదు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో రైతుల కష్టాలు చూసి స్వరాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వరిసాగు పెరిగింది. కాంగ్రెస్ చెబుతున్న మూడు గంటల కరెంట్తో పొలం ఎలా పారుతుంది. 10 హెచ్పీ మోటర్లు వాడాలంటున్నారు. వాటిని కొనేందుకు రైతులకు డబ్బులు ఎవరు ఇస్తారు, అలాగే ఇప్పుడు ఉన్న కరెంట్ సరఫరా వ్యవస్థ 10 హెచ్పీ మోటర్ల సామర్థ్యాన్ని ఎలా తట్టుకుంటున్నాయి. మళ్లీ మోటర్లు కాలడం, ట్రాన్స్ఫార్మర్లు పేలడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కోసం రేయింబవళ్లు ఎదురు చూడాల్సిందే. గతంలో వారి పాలనలో రైతులు అరిగోస పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలకు సరిపడా కరెంట్ ఉంది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కరెంట్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులు చల్లగా బతుకుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వచ్చి ఆది చేస్తాం, ఇది చేస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. వాటిని నమ్మితే మళ్లీ మోసపోతాం. రైతు రాజ్యం కోసం మళ్లీ కేసీఆర్యే సీఎం కావాలి.
ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెసోళ్లు రైతుల గురించి పూటకో మాట మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో మంచిగ నడుస్తున్న ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని చెబుతున్నరు. దీని వల్ల మళ్లీ పాత రోజులు వస్తయి. కొత్త పద్ధతికి ముందే ఎవరికి ఇబ్బందులు రాకుండా సీఎం కేసీఆర్ కొత్త పాసు పుస్తకాలు సైతం అందజేశారు. రూపాయి ఖర్చు లేకుండా పాసు పుస్తకాలు ఇంటికి వచ్చి అధికారులు ఇచ్చారు. ఇంతకన్నా రైతులకు ఏం కావాలి. ధరణి తీసివేయాలని మేము ఎక్కడ ధర్నాలు చేయలేదు. నిరసనలు చేయలేదు. రైతులకు ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. గొడవలు లేకుండా భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. పాత విధానాన్ని తీసుకొస్తామంటే ఊర్కునేది లేదు. బీఆర్ఎస్కే మా మద్దతు.
మూడు గంటల కరెంట్తో మళ్లీ రైతులు నిండా మునుగుతారు. కొద్దిరోజుల నుంచి టీవీలలో ఇదే వస్తున్నది. మూడు గంటల కరెంట్ ఇచ్చేటప్పుడు పెద్ద మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. 10హెచ్పీ మోటర్లు చిన్న రైతులతో అయ్యే పనా. అప్పు చేసి కొన్నా బావుల్లో ఆ మాదిరిగా నీళ్లు ఉండాలి కదా. 10హెచ్పీ మోటర్లు వాడితే బావుల్లో జలం పూర్తిగా ఇంకిపోతుంది. 24 గంటల కరెంట్ సరఫరాతో ప్రస్తుతం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకున్న వారికి రైతుల మద్దతు ఉంటుంది. 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్కే మద్దతిస్తాం.
కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ ఇస్తే ఎట్లా సరిపోతుంది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం నానా తిప్పలు పడ్డాం. రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. కానీ రైతులకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ తెచ్చుకున్నాక సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెం అందిస్తున్నారు. కరెంట్ తిప్పలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటు వేయం. తెలంగాణ పార్టీకి ఓటు వేసి కేసీఆర్ను గెలిపించుకుందాం.
24 గంటల కరెంట్తో పొలం ఎండిపోతుందనే భయంలేదు. కాంగ్రెస్ కనుక 3 గంటలు కరెంట్ ఇస్తే అప్పుడు 10 హెచ్పీ మోటార్లు వాడాలి. అదో దుబారా ఖర్చు. ఇంకొటి కాంగ్రెస్కు ఓటు వేసి రాత్రిళ్లు పొలాల వెంట తిరుగలేను…. ఆ మూడు గంటలు కరెంట్లో కూడా ఎప్పుడిస్తడో తెలియకపోతే నేను పొలం వద్దే పడిగాపులు పడాల్సి వస్తది.
కరెంట్ కష్టాలతో వ్యవసాయం వదిలి వెళ్లిన వాళ్లు ఉన్నారు. కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు పూర్తిగా తొలగినాయి. కాంగ్రెస్ సర్కారులో రాత్రిళ్లు కరెంట్ ఇచ్చిన రోజుల్లో అక్కడే జాగారం చేసేవాళ్లం. ఇప్పుడు పూర్తిగా కరెంట్ అందడంతో మిరప సాగు చేస్తున్నాం. సాగునీరు కూడా సకాలంలో అందుతున్నది. రైతులకు ముఖ్యంగా నిరంతర విద్యుత్ ఉండాల్సిందే. సాగు చేసే పోడుభూములకు సైతం పట్టాలు వచ్చాయి. వీటితో రైతుబంధు, ఇతర పథకాలు అందుతున్నాయి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి.
రైతన్న భూమికి పైసా ఖర్చు లేకుండా పాస్బుక్ వచ్చిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి ఘనతే. గతంలో పొలానికి పాస్బుక్లు చేయించుకోవాలంటే వీఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు వారి ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా ప్రదక్షణలు చేయడమే తప్ప, పని అయ్యేది కాదు. అటువంటి పరిస్థితులను చక్క దిద్దేందుకు ధరణి పోర్టల్ రావడంతో రైతన్న ఒక్కరోజులోనే పాస్బుక్లు చేయించుకొని ఆనంద పడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత ప్రవేశపెడితే రైతుల భూములు మాయమవుతాయి. ధరణిని కాపాడుకునేందుకు కారు గుర్తుకే ఓటు వేయాలి.
విధి విధానం లేకుండా అభూత కల్పనతో ప్రచారానికే కాంగ్రెస్ పార్టీ ధరణి స్థానంలో భూమాత పథకాన్ని తీసుకొస్తున్నారు తప్ప రైతుకు వెన్నుదన్నుగా ఉన్న ధరణిని వదులుకోవద్దు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు ధరణి పోర్టల్ను ఆగం చేసుకోవద్దు. ధరణితోనే రైతు భూములకు రక్షణతో పాటు, నేరుగా వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. రైతులందరూ ధరణిని కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ను బలపరిచేందుకు కారు గుర్తుకు ఓటు వేయాలి.
పదేళ్ల క్రితం పట్టపగటే కరెంట్ ఉండేదే కాదు. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడి పోయే వాళ్లం. మా గ్రామంలో ఉదయం 6 గంటలకు కరెంటు పోతే రాత్రి 7 గంటలకు వచ్చేది. గృహిణులు, వృద్ధులు చిన్నారులతో కలసి చెట్ల కిందకు చేరుకొని గాలి విసురుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ అమలు చేసిన విద్యుత్ సంస్కరణలతో 24 గంటల పాటు గృహాలకు, వ్యవసాయానికి కరెంట్ నిరంతరాయంగా వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్కు పల్లెప్రజలంతా రుణపడి ఉంటారు. సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్రంలో కరెంటు కష్టాలు మాయమయ్యాయి.
నిజంగా వ్యవసాయం చేసిన వాళ్లకు కరెంట్ విలువ, సాగువిలువ తెలస్తుంది. కానీ ప్రతిపక్షానికి చెందిన నాయకులు 10 హెచ్పీ సామర్ధ్యం గల మోటార్లతో 3 గంటలు విద్యుత్ చాలు అంటున్నారు… అసలు…10 హెచ్పీ సామర్ధ్యం గల మోటార్లను ప్రభుత్వం మంజూరు చేస్తుం దా లేదా…. రైతులే కొనుక్కోవాల్నా…. అది చెప్పలేదు.. అయినా రైతులు ప్రసు తం ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ విధానానికే మొగ్గుచూపుతారు.. ప్రతిపక్షాల మా టలకు చేతలకు పొంతన లేకుండా ఉన్నాయి. రాష్ట్రంలో రైతు ముఖ్యమంత్రిగా ఉండడం వలనే రైతులకు ప్రాధాన్యం పెరిగింది. రైతుల కోసం ఎన్నెన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. మూడో సారి సీఎం కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులం కోరుకుంటున్నాం.
తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్తో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. తెలంగాణ రాకముందు కరెంటు సరిగా లేక భూములన్నీ బీడువారాయి. నేడు రైతులంతా రెండు పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నాం. మళ్లీ కాంగ్రెస్ నాయకులొస్తే మూడు గంటల కరెంటు అంటున్నారు. 10హెచ్పీ మోటర్లు అంటున్నారు. అవి పెట్టాలంటే రైతుకు అదనపు భారమవుతుంది. నిత్యం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. ఆ పరిస్థితి వద్దే..వద్దు. కాంగ్రెస్ వాళ్లొస్తే మన నోట్లో మనం మట్టి పోసుకున్నట్లవుతుంది. కేసీఆరే రావాలి. రైతులకు మేలు జరగాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దుచేస్తామని చెబుతున్నా రు. అట్లయితే తిరిగి దళారుల రా జ్యం వ స్తుంది. ఇన్నేళ్లు రైతు లు తమ భూములను తమ పేరుమీద మా ర్చుకునేందుకు దళారులను ఆశ్రయించి లంచాలు ముట్టజెబితే పని అయ్యేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తేవడంతో ఆ తిప్పలు తప్పి తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తవుతుంది. ఒక్కపైసా లంచం కూ డా ఇవ్వకుండా పట్టాదారు పాస్బుక్లో పేరు నమోదవుతుంది. అంత మంచి ధరణిని రద్దుచేస్తామనడం సరికాదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ను కాంగ్రెస్ నాయకులు తీసేస్తామని చెబుతున్నారు. ధరణి ఎత్తేస్తే భూమికి రక్షణ పోతుంది. మళ్లీ పట్వారీల అజమాయిషీ వస్తే భూములపై ఉన్న ధీమా పోతుంది. ధరణి పోర్టల్ లేకపోతే భూ సమస్యలు పెరిగిపోయి రోజూ గొడవలే. తహసీల్దార్ కార్యాలయాల్లో ఒకరి భూమి ఒకరికి రాశారని రోజూ పంచాయతీలు జరుగుతాయి. ఈ బాధలను అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి ధరణి తీసుకువచ్చి మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా 10 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. భూములకు భద్రత వచ్చింది. ధరణి తీసేస్తే పాతరోజులొస్తాయి. మళ్లీ కేసీఆర్ రావాలి. ధరణి ఉండాలి.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు 10హెచ్పీ మోటర్లు పెడితే భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయి. ప్రస్తుతం 3, 5హెచ్పీ మోటర్లతో పుష్కలంగా నీరు పారుతున్నాయి. 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే కరెంటు వద్దు…10హెచ్పీ మోటర్లు వద్దు. మళ్లీ పాత కష్టాలు కొనితెచ్చుకోం. రైతులను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం చాలా కష్టాలు పడ్డాం. రాత్రి పూట బోరు బావుల వద్దకు వెళ్లి కరెంటు కోసం పడిగాపులు కాసేవాళ్లం. కానీ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు వస్తుంది. రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లే బాధ తప్పింది. రెండు పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉంటు న్నాం. కానీ వ్యవసాయం గురించి తెలియని కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటు చాలని చెప్పడం రైతులను అవమానించడమే. మూడు గంటల కరెంటుతో అరెకరం కూడా తడవదు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
పదేండ్ల క్రితం రోజులు మళ్లీ వస్తే చాలా మంది ఇబ్బంది పడక తప్పదు. తెలంగాణ రాక ముందు కరెంట్ బాధల వల్ల చిన్న వ్యాపారులు మొదలు కొని పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతినిండా పని లేకపోవడంతో రోజువారీ కూలీలు సైతం అవస్థలు పడ్డారు. తిరిగి మూడు గంటల కరెంట్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం ఎంత మాత్రం సరికాదు. 24 గంటల కరెంట్తోనే రైతులకు, చిన్న వ్యాపారులకు సైతం మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ చొరవ కారణంగా గడిచిన పదేండ్లుగా నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతోంది. దీంతో కరెంట్ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంటు అంటే ఎలా. నిరంతరాయంగా కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ వైపే ఉంటాం.