ఖమ్మం : ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్ టౌన్ ,మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆకస్మికంగా తనికీ చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు.అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల వివక్ష చూపకుండా అందరికీ సమానంగా న్యాయం అందేలా చూడాలన్నారు.
వారి గౌరవానికి భంగం కలగకుండా మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కేసుల నమోదు విషయంలో తాత్సారం చేయవద్దన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పోలీస్ స్టేషన్ లలో రికార్డులను ఏవిధంగా భద్రపరుచుకోవాలి, స్టేషన్ పరిసరాలను ఏ విదంగా పరిశుభ్రపరుచుకోవాలి, కానిస్టేబుల్స్ విధుల పట్ల ఏ విదంగా బాధ్యతయుతంగా ఉండాలి, అనే అంశాలపై తగు సూచనలు చేశారు.