ఖమ్మం: ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై జరుగుతున్న పలు అబివృద్ది, సుందరీకరణ పనులను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి సోమవారం పరిశీలించారు. ట్యాంక్ బండ్పై నిర్మిస్తున్న తీగల వంతెన పనులు, ఇతర సుందరీకరణ పనులు నిర్థేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
తీగల వంతెన పనులు వేగవంతం చేసి ప్రారంభానికి సిద్దంగా ఉంచాలని అన్నారు. పండుగలు, సెలవు రోజుల్లో నగర ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.