ఖమ్మం : ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవిన్యూ ఉద్యోగి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో రెవిన్యూ ఉద్యోగులు ముందుండాలని తెలిపారు. ఉద్యోగులకు, అధికారులకు అవసరమైన మంచి సమాచారంలో డైరీని రూపొందించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునిల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దొడ్డే పుల్లయ్య, రాష్ట్ర కోశాధికారి బీవీఆర్, జిల్లా కోశాధికారి క్రాంతికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, దాసరి రవి, జిల్లా జాయింట్ సెక్రటరీ కేవీవీ.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తుమ్మా రవీందర్, దొడ్డారపు సైదులు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శుల సత్యనారాయణ, వహీద్, ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు దామోదర్, కల్లూరు డివిజన్ అద్యక్ష కార్యదర్శులు రహీమ్, అశోక్, జిల్లా సంఘ బాధ్యులు రాళ్ళబండి రాంబాబు, తూమాటి శ్రీనివాస్, రమేష్, ఎం.శ్రీను, అభిరామ్, హుస్సేన్, నజీర్, తదితరులు పాల్గొన్నారు.