మామిళ్లగూడెం, మార్చి 26 : లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ను పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,459 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పీవో, ఏపీవోల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు 5,840 మంది సిబ్బంది అవసరం ఉండగా.. 20 నుంచి 30 శాతం రిజర్వ్ సిబ్బందితో కూడిన జాబితాను రూపొందించాలన్నారు. పే సేల్, కేటగిరీ ప్రకారం పీవో, ఏపీవో, ఓపీవోల నియామకం చేపట్టాలన్నారు.
ఎంపిక చేసిన సిబ్బందికి ముందస్తు సమాచారం అందించి శిక్షణలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి మొదటి విడత శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, డీఆర్వో ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, ఏఎస్వో కిశోర్, అధికారులు పాల్గొన్నారు.