పాల్వంచ, మే 28: భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్.. తన సతీమణి గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించడంతోపాటు వైద్యుల సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్ భార్యకు తొమ్మిది నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. జిల్లా వైద్య సమన్వయ అధికారి రవిబాబు, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్, సర్జన్ సోమరాజు దొర, అనస్తీసియా డాక్టర్ ప్రసాద్ సమక్షంలో నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత, గైనకాలజిస్టు సరళ, అనూషలు సిజేరియన్ చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కలెక్టర్కు స్వీట్లు తినిపించారు.