కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించిన గ్రంధె సాయికృష్ణను కలెక్టర్ అనుదీప్ అభినందించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో సివిల్స్లో 293వ ర్యాంకు సాధించిన సాయికృష్ణ కుటుంబ సభ్యులను శాలువాకప్పి సత్కరించారు. సివిల్స్లో ర్యాంకు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని, కోచింగ్ లేకుండా ర్యాంకు సాధించడం హర్షణీయమన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే జీవితంలో ఏదైనా సాధించగలమని అన్నారు. నేను విఫలమైన రోజుల్లో తల్లిదండ్రులు ఎంతో ప్రేరణ ఇచ్చారని, ధైర్యాన్ని అందించారని వారి ప్రోత్సాహం వల్లనే నేను సాధించగలిగినట్లు చెప్పారు. సాధించాలన్న తపన, పట్టుదల, ఆసక్తి ఉండాలని, బలవంతంగా పట్టుబడితే రాదని అన్నారు. మెయిన్స్కు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారని అడిగి తెలుసుకొని సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు నాగలక్ష్మీ, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.