ముదిగొండ : జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మండల కేంద్రం ముదిగొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు వరమనీ, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అద్యక్ష్య, కార్యదర్శులు ,లక్ష్మా రెడ్డి, గడ్డం వెంకటి, బీసీ సెల్ అధ్యక్ష్యుడు తోట ధర్మారావు, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, సర్పంచులు మందరపు లక్ష్మీ, సామినేని రమేష్, కోటి అనంతరాములు, ఓబినబోయిన అమరయ్య, టీఆర్ఎస్ నాయకులు బత్తుల వీరారెడ్డి, ఎర్ర వెంకన్న, పోట్ల ప్రసాద్, యాకూబ్, పసుపులేటి వెంకట్, వేముల శ్రీను, పాషా, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.